ఉషా దంతవైద్యశాల వారిచే ఎస్వీ పబ్లిక్ స్కూలు లో ఉచిత దంత వైద్య శిబిరం
- July 14, 2016
స్థానిక బచ్చుపేట హిందూ కాలేజీ ఆవరణలోని ఎస్వీ పబ్లిక్ స్కూల్ లో గురువారం ఉదయం నుంచీ ఉషా దంత వైద్యశాల వారు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జొన్నలగడ్డ ఉషాకాంతి, డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ లీలారాణి సాయంత్రం వరకూ ఉండి రెండు వందలకు పైగా పిల్లలకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. దంత సంరక్షణ బాగా చేసుకుంటున్న పిల్లలకు బహుమతులిచ్చి ప్రోత్సహించారు. డాక్టర్ ఉషా కాంతి మాట్లాడుతూ రోజుకు రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలనీ, చాక్లెట్లు, పళ్లకు అంటుకునే పదార్ధాలు తిన్న వెంటనే పుక్కిలించి శుభ్రపరచుకోవటం అలవాటు చేసుకుంటే పిప్పి పళ్ళు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. పరీక్షించిన పిదప పిల్లలందరికీ సూచనలతో కూడిన పత్రాలను, బ్రష్షు, పేస్టులు పంచారు.


తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









