ఉషా దంతవైద్యశాల వారిచే ఎస్వీ పబ్లిక్ స్కూలు లో ఉచిత దంత వైద్య శిబిరం
- July 14, 2016
స్థానిక బచ్చుపేట హిందూ కాలేజీ ఆవరణలోని ఎస్వీ పబ్లిక్ స్కూల్ లో గురువారం ఉదయం నుంచీ ఉషా దంత వైద్యశాల వారు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జొన్నలగడ్డ ఉషాకాంతి, డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ లీలారాణి సాయంత్రం వరకూ ఉండి రెండు వందలకు పైగా పిల్లలకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. దంత సంరక్షణ బాగా చేసుకుంటున్న పిల్లలకు బహుమతులిచ్చి ప్రోత్సహించారు. డాక్టర్ ఉషా కాంతి మాట్లాడుతూ రోజుకు రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలనీ, చాక్లెట్లు, పళ్లకు అంటుకునే పదార్ధాలు తిన్న వెంటనే పుక్కిలించి శుభ్రపరచుకోవటం అలవాటు చేసుకుంటే పిప్పి పళ్ళు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. పరీక్షించిన పిదప పిల్లలందరికీ సూచనలతో కూడిన పత్రాలను, బ్రష్షు, పేస్టులు పంచారు.


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







