సౌదీలో విదేశీయుల కోసం కొత్త ప్రాపర్టీ ఓనర్షిప్ చట్టం..!!
- July 09, 2025
జెడ్డా: సౌదీయేతరుల ఆస్తి యాజమాన్యాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ అరేబియా క్యాబినెట్ ఆమోదించింది. జెడ్డాలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ఇటీవల జరిగిన చర్చలు , జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నుండి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్కు వివరించారు.
సౌదీ-ఇండోనేషియా సుప్రీం కోఆర్డినేషన్ కౌన్సిల్ మొదటి సమావేశాన్ని క్యాబినెట్ ప్రశంసించింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని హైలైట్ చేసింది. ఈ ఒప్పందాలు క్లీన్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఏవియేషన్ ఇంధన సేవలు, తదితర రంగాలను కవర్ చేస్తాయని మంత్రి డాక్టర్ ఎస్సామ్ బిన్ సయీద్ తెలిపారు. పెట్రోలియం మార్కెట్ బ్యాలెన్స్ ను కాపేడేందుకు మద్దతు ఇవ్వడానికి OPEC+ కూటమిలోని చమురు ఉత్పత్తిదారులతో నిరంతర సమన్వయం చేసుకుంటున్నట్ల పేర్కొన్నారు.
ఈ నవంబర్లో రియాద్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO) 21వ జనరల్ కాన్ఫరెన్స్ను సౌదీ అరేబియా నిర్వహించడాన్ని మంత్రివర్గం స్వాగతించింది. అలాగే, డిజిటల్ ప్లేసేలలో పిల్లలను రక్షించడానికి సౌదీ నేతృత్వంలోని తీర్మానాన్ని UN మానవ హక్కుల మండలి ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని మంత్రివర్గం ప్రశంసించింది. ఈ చొరవ క్రౌన్ ప్రిన్స్ ప్రారంభించిన ప్రపంచ "చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ" నుంచి వచ్చిందన్నారు. 2025 ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కాంపిటీటివ్నెస్ ఇయర్బుక్ ప్రకారం.. సౌదీ అరేబియా ప్రపంచ సైబర్ భద్రతలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…







