దుబాయ్ లో అరబ్ వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా..!!
- July 11, 2025
యూఏఈ: నైఫ్లోని ఒక టూరిజం కంపెనీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సాయుధ దోపిడీలో పాల్గొన్నందుకు M.A.K. గా గుర్తించిన 48 ఏళ్ల అరబ్ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించిన కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ గతంలో జారీ చేసిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
కేసు రికార్డుల ప్రకారం.. అరబ్ జాతీయుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి కంపెనీలో చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చిలో జరిగింది. కంపెనీ యజమాని తన ఆఫీసు తలుపును ఒక వ్యక్తి తట్టాడని, యజమాని తలుపు తెరిచిన తర్వాత, ఆరుగురు వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుండగులలో ఒకరు బాధితుడి నుండి తాళం తీసుకొని సేఫ్ తెరిచి, Dh247,000 దొంగిలించి, మిగిలిన వారితో అక్కడి నుండి పారిపోయారు.
దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రధాన నిందితుడిని గుర్తించి ట్రాక్ చేసి మరొక ఎమిరేట్లో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆఫ్రికా కు చెందిన మిగిలిన అనుమానితులు తనను చోరీలో పాల్గొనమని బలవంతం చేశారని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







