దుబాయ్ లో అరబ్ వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా..!!
- July 11, 2025
యూఏఈ: నైఫ్లోని ఒక టూరిజం కంపెనీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సాయుధ దోపిడీలో పాల్గొన్నందుకు M.A.K. గా గుర్తించిన 48 ఏళ్ల అరబ్ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించిన కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ గతంలో జారీ చేసిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
కేసు రికార్డుల ప్రకారం.. అరబ్ జాతీయుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి కంపెనీలో చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చిలో జరిగింది. కంపెనీ యజమాని తన ఆఫీసు తలుపును ఒక వ్యక్తి తట్టాడని, యజమాని తలుపు తెరిచిన తర్వాత, ఆరుగురు వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుండగులలో ఒకరు బాధితుడి నుండి తాళం తీసుకొని సేఫ్ తెరిచి, Dh247,000 దొంగిలించి, మిగిలిన వారితో అక్కడి నుండి పారిపోయారు.
దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రధాన నిందితుడిని గుర్తించి ట్రాక్ చేసి మరొక ఎమిరేట్లో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆఫ్రికా కు చెందిన మిగిలిన అనుమానితులు తనను చోరీలో పాల్గొనమని బలవంతం చేశారని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







