దుబాయ్ లో అరబ్ వ్యక్తికి 3 ఏళ్ల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా..!!
- July 11, 2025
యూఏఈ: నైఫ్లోని ఒక టూరిజం కంపెనీ కార్యాలయంలో ఇటీవల జరిగిన సాయుధ దోపిడీలో పాల్గొన్నందుకు M.A.K. గా గుర్తించిన 48 ఏళ్ల అరబ్ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, 247,000 దిర్హామ్ల జరిమానా విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని బహిష్కరించాలని ఆదేశించిన కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ గతంలో జారీ చేసిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
కేసు రికార్డుల ప్రకారం.. అరబ్ జాతీయుడైన నిందితుడు మరో ఐదుగురితో కలిసి కంపెనీలో చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ సంవత్సరం మార్చిలో జరిగింది. కంపెనీ యజమాని తన ఆఫీసు తలుపును ఒక వ్యక్తి తట్టాడని, యజమాని తలుపు తెరిచిన తర్వాత, ఆరుగురు వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుండగులలో ఒకరు బాధితుడి నుండి తాళం తీసుకొని సేఫ్ తెరిచి, Dh247,000 దొంగిలించి, మిగిలిన వారితో అక్కడి నుండి పారిపోయారు.
దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రధాన నిందితుడిని గుర్తించి ట్రాక్ చేసి మరొక ఎమిరేట్లో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆఫ్రికా కు చెందిన మిగిలిన అనుమానితులు తనను చోరీలో పాల్గొనమని బలవంతం చేశారని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









