సిబ్బందితో బహిరంగ పనిని సాయంత్రం వేళ చేయించేందుకు సంస్థల ఆసక్తి

- July 14, 2016 , by Maagulf
సిబ్బందితో బహిరంగ పనిని సాయంత్రం వేళ చేయించేందుకు సంస్థల ఆసక్తి

వేసవిలో భారంగా వాతావరణ పరిస్థితులు కతర్ లో  కొనసాగుతున్నాయినిర్మాణ సంస్థల అనేకం తమ తమ సిబ్బందితో  రోజు వేకువజామున లేదా సాయంత్రం వేళ బహిరంగ పని చేయించేందుకు అలవాటుపడటం జరుగుతుంది.

సంస్థలు పాక్షికంగా లేదా పూర్తిగా సాయంత్రం లేదా ఉదయాన్నే కార్మికులతో బహిరంగ పనులను చేయించేందుకు  చర్యలను తీసుకొంటున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " పరిశీలనలో సైతం తేలింది. ఇందులో కొన్ని సంస్థలకు దోహా లో మరియు శివార్లలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులలో వీటిని అమలు చేసేందుకు  ప్రయత్నిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో,పని వేళలో మార్పు కార్మికులకు ఎంతో ఉపశమనం కల్గిస్తుంది. వేసవి కారణంగా మారిన పరిస్థితులు కారణంగా ఆలస్యంగా సాయంత్రం వేళలలో పనులు ప్రారంభించడంతో నిర్మాణ విధుల విషయంలో కార్మికులు తమ పనులను ఎంతో సులభతరంగా నిర్వహిస్తున్నారు. వారు పని గంటలను మరింతగా భరించదగినట్లుగా ఉన్నారు తద్వారా మృదువైన మరియు సమర్థవంతమైన  ఉత్పాదకతని సాధించే దిశలో నిర్ధారిస్తుంచడం గమనించవచ్చు.. మధ్యాహ్నం పూత  పని నిషేధం విధానం తీవ్రమైన వేసవి నెలల్లో ప్రతి సంవత్సరం కతర్ అమలవుతుంది. మంత్రివర్గ నిర్దేశకం ప్రకారము ఎటువంటి బహిరంగ పనులను కార్మికులతో చేయించరాదని జూన్ నెల మధ్య నుండి  ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంది. కాలంలో ఉదయం 11.30 గంటల నుండి  మరియు సాయంత్రం మూడు గంటల కాలంలో పనికి అనుమతి నిషేధించారు. కార్మికుల పరిస్థితి మరింత సులభం చేసేందుకు, కొన్ని కంపెనీలు సాయంత్రం 7 గంటల నుంచి లేదా తెల్లవారుజామున 2 గంటలు  2.30 గంటల  తర్వాత పని  ప్రారంభించడానికి మార్పులకు తెర తీశారు. పగటి పూట కూడా పని చేస్తున్నప్పుడు, కార్మికులు ఇప్పటికీ కొంత ఉపశమనం పొందినప్పటకీ  మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకు పని మొదలు పెట్టినపుడు  ఉష్ణోగ్రత ఉదయం పూట పని గంటల కంటే సాధారణంగా వేడి  అధికంగానే ఉంటుందని కార్మికులు వాపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com