కువైట్ విమానాశ్రయంలో పెరిగిన అత్యవసర వైద్య సంసిద్ధత..!!
- July 15, 2025
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ కార్డియాక్ డీఫిబ్రిలేటర్లను (AEDలు) కీలక టెర్మినల్స్లో ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర వైద్య సంసిద్ధతను పెంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. AED పరికరాలను టెర్మినల్స్ 1, 4 మరియు 5లో, అలాగే విమానాశ్రయ ఆరోగ్య కేంద్రంలో, ప్రజారోగ్య రంగం పర్యవేక్షణలో అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. ఈ మేరకు X ప్లాట్ఫారమ్లోని ఒక ప్రకటనను షేర్ చేశారు. డీఫిబ్రిలేటర్లను సకాలంలో ఉపయోగించడం వల్ల బతికే రేటు 70% వరకు పెరుగుతుందని డాక్టర్ అల్-సనద్ పేర్కొన్నారు.
గుండె లయ ప్రమాదకరంగా అసాధారణంగా మారినప్పుడు, ఆకస్మిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉన్నప్పుడు సాధారణ హృదయ స్పందనను పునరుద్ధరించడానికి కార్డియాక్ డీఫిబ్రిలేటర్ కీలకంగా మారుతుంది. AEDలు పోర్టబుల్ డీఫిబ్రిలేటర్లు, వీటిని వైద్య శిక్షణ లేనివారు కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఆకస్మిక గుండెపోటును ఎదుర్కొంటున్న వారికి ఇవి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. పరికరాలను సమర్థవంతంగా ఆపరేట్ చేయడానికి విమానాశ్రయ సిబ్బందికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







