ఆంధ్రప్రదేశ్కు విశేష గౌరవం..
- July 16, 2025
అమరావతి: లింక్డ్ఇన్ విడుదల చేసిన “సిటీస్ ఆన్ ది రైజ్ 2025” నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడ స్థానం దక్కించుకున్నాయి. భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రొఫెషనల్ హబ్లలో విశాఖపట్నం మొదటి స్థానాన్ని, విజయవాడ మూడవ స్థానాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది ఆంధ్రప్రదేశ్లో వేగంగా విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, కెరీర్ అభివృద్ధి అవకాశాలను సూచిస్తుంది.
లింక్డ్ఇన్ ఈ జాబితాను రూపొందించేటప్పుడు ఉద్యోగ వృద్ధి, ప్రొఫెషనల్ వలస, ఆర్థిక చైతన్యం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది.
తంలో కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే లభ్యమైన అవకాశాలు ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ నగరాలు కొత్త ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మరింతగా ఆకర్షిస్తున్నాయి.
“సిటీస్ ఆన్ ది రైజ్ 2025” జాబితాలో టాప్ 10 నగరాలు
- విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- రాంచీ, జార్ఖండ్
- విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- నాసిక్, మహారాష్ట్ర
- రాయ్పూర్, ఛత్తీస్గఢ్
- రాజ్కోట్, గుజరాత్
- ఆగ్రా, ఉత్తరప్రదేశ్
- మదురై, తమిళనాడు
- వడోదర, గుజరాత్
- జోధ్పూర్, రాజస్థాన్
ఏపీకి లాభాలు
విశాఖపట్నం, విజయవాడలకు లభించిన ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త వ్యాపార అవకాశాలు మరింతగా లభించేందుకు దోహదం చేస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చి, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









