‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే..
- July 19, 2025
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనుంది.ఈ ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులు ఎవరు వస్తారో అని పెద్ద చర్చే నడుస్తుంది.
గతంలో రాజమౌళి, చిరంజీవి అని పేర్లు వినిపించాయి.నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా వస్తారో తెలిపారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు. ప్రస్తుతానికి ఈ ఈవెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖన్ద్రే గెస్టులుగా రానున్నారు.ఆయన్ని పవన్ పిలవమన్నారు. అందుకే నేనే స్వయంగా వెళ్లి పిలిచాను.చిరంజీవి రావట్లేదు. ఫ్యామిలీ వద్దన్నారు పవన్ కళ్యాణ్. రాజమౌళి రావొచ్చు.నేను ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ వస్తారు అని అన్నారు.
దీంతో ఈసారి కాస్త పొలిటికల్ గా కూడా ఈవెంట్ సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఏపీకి కొంకి ఏనుగుల విషయంలో సపోర్ట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని బాగా పొగిడారు.అలాగే పార్టీలు వేరైనా ఒక మంచి విషయం కోసం కలిసి పనిచేసే ఆయన తత్వం పవన్ కళ్యాణ్ కి నచ్చింది. అందుకే ఆయన్ని పిలవమన్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







