షేరింగ్ ఫ్రిజ్లు రమదాన్ పూర్తయ్యాక కూడా
- July 15, 2016
50కి పైగా రమదాన్ ఫ్రిజ్లు యూఏఈలోని కార్మికులకు రమదాన్ సందర్భంగానే కాకుండా రమదాన్ ముగిసిన తర్వాత కూడా చల్లని కబురు అందించనున్నాయి. సగానికి పైగా ఫ్రిజ్లు 14 దుబాయ్ కమ్యూనిటీస్లో సేవలు అందించనున్నాయి. మిర్దిఫ్, ది మెడోస్, ది లేక్స్, మోటర్ జిటీ, జబెల్ అలీ, మరియు అల్ బర్షాలలో ఈ ఏడాది చివరి వరకు ఫ్రిజ్లు కార్మికుల కోసం అందుబాటులో ఉంటాయి. రమదాన్ షేరింగ్ ఫ్రిజ్స్ పేరుతో ఫేస్బుక్ గ్రూప్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియాకి చెందిన 29 ఏళ్ళ సుమ్మయ్యా సైద్ మాట్లాడుతూ, ఈ షేరింగ్ ఫ్రిజ్ల విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వేసవి సందర్భంగా విదేశాలకు వెళ్ళేవారు తమ ఫ్రిజ్లను ఈ గ్రూప్ ద్వారా మరింత ఎక్కువమందికి సేవలందించడానికి ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రమదాన్ మాసం అంటే 'జాయ్ ఆఫ్ గివింగ్' కింద భావిస్తారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం చాలా గొప్ప విషయమని జోర్డాన్ నుంచి వచ్చిన దుబాయ్ రెసిడెంట్ ఒమర్ షాంకితి చెప్పారు. ప్రస్తుతానికి 26 ఫ్రిజ్లు దుబాయ్లో పనిచేస్తున్నాయనీ, ముందు ముందు ఈ సంఖ్య బాగా పెరుగుతుందనీ, తద్వారా ఎక్కువమందికి ఉపయోగపడ్తాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







