ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్..
- July 24, 2025
నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో గ్రేడ్ III, గ్రేడ్ V, గ్రేడ్ VII ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 262 పోస్టులను భర్తీ చేయనుంది.దీనిని సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 18తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://oil-india.comద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
టెన్త్, ఇంటర్, బి.ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా/హిందీ ఆనర్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 38 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, PwBD కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.
వేతన వివరాలు:
గ్రేడ్ III లో పనిచేసే వారికి: రూ.26,600 నుంచి రూ. 90,000 వరకు జీతం ఉంటుంది.
గ్రేడ్ V లో పనిచేసే వారికి: రూ.32,000 నుంచి రూ.1,27,000 వరకు జీతం ఇస్తారు.
గ్రేడ్ VII లో పనిచేసే వారికి: నెలకు రూ.37,500 నుంచి రూ.1,45,000 వరకు జీతం లభిస్తుంది. వీటితో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







