ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్..
- July 24, 2025
నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో గ్రేడ్ III, గ్రేడ్ V, గ్రేడ్ VII ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 262 పోస్టులను భర్తీ చేయనుంది.దీనిని సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 18తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://oil-india.comద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
టెన్త్, ఇంటర్, బి.ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా/హిందీ ఆనర్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 38 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, PwBD కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.
వేతన వివరాలు:
గ్రేడ్ III లో పనిచేసే వారికి: రూ.26,600 నుంచి రూ. 90,000 వరకు జీతం ఉంటుంది.
గ్రేడ్ V లో పనిచేసే వారికి: రూ.32,000 నుంచి రూ.1,27,000 వరకు జీతం ఇస్తారు.
గ్రేడ్ VII లో పనిచేసే వారికి: నెలకు రూ.37,500 నుంచి రూ.1,45,000 వరకు జీతం లభిస్తుంది. వీటితో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందుతాయి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









