ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్..
- July 24, 2025
నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో గ్రేడ్ III, గ్రేడ్ V, గ్రేడ్ VII ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా 262 పోస్టులను భర్తీ చేయనుంది.దీనిని సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 18తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://oil-india.comద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
టెన్త్, ఇంటర్, బి.ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా/హిందీ ఆనర్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 38 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, PwBD కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.
వేతన వివరాలు:
గ్రేడ్ III లో పనిచేసే వారికి: రూ.26,600 నుంచి రూ. 90,000 వరకు జీతం ఉంటుంది.
గ్రేడ్ V లో పనిచేసే వారికి: రూ.32,000 నుంచి రూ.1,27,000 వరకు జీతం ఇస్తారు.
గ్రేడ్ VII లో పనిచేసే వారికి: నెలకు రూ.37,500 నుంచి రూ.1,45,000 వరకు జీతం లభిస్తుంది. వీటితో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









