ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- July 19, 2026
మస్కట్: ఒమాన్లోని ధోఫార్ గవర్నరేట్ నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన దక్షిణ అల్ షర్కియాహ్ ప్రాంత ప్రజలను, విద్యా వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఉపాధ్యాయురాలితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద వార్తతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జలాన్ బని బు అలీ ప్రాంతంలోని దౌహత్ అల్ ఇల్మ్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది విడుదల చేసిన ప్రకటనలో ఆమెకు ఘన నివాళి అర్పించారు. రెండు దశాబ్దాలకు పైగా విద్యార్థులకు అంకితభావంతో బోధించిన ఆదర్శ ఉపాధ్యాయురాలిగా ఆమెను కొనియాడారు. ఈ ప్రమాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని పలువురు ప్రార్థిస్తున్నారు.
ఖరీఫ్ పర్యాటక సీజన్లో ధోఫార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుండటంతో రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులు మరోసారి గుర్తు చేశారు. అలసటతో వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







