టెన్త్ పాసైన వారికి బంపర్ ఆఫర్..
- July 31, 2025
న్యూ ఢిల్లీ: మీరు టెన్త్ ఆపై చదువులు పూర్తి చేసి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ వృత్తి నైపుణ్య ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్. సతీష్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఈజిఎం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
మూడు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ అందజేయనున్నారు. బిపిఓ వాయిస్, లాజిస్టిక్, హెల్త్ కేర్, కంప్యూటర్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, హార్డ్ వెర్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు.కాబట్టి, యువత ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
విద్యార్హత: పదవ తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువత, మహిళలు ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చు. కేటగిరీ ప్రకారం ఎస్సీ అభ్యర్థులకు 45 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
శిక్షణ వివారాలు: అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు, శిక్షణ కాలంలో భోజన సౌకర్యం కూడా అందజేస్తారు.
కాబట్టి మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.మరిన్ని వివరాలు, సందేహాల కోసం 98498 69694, 94901 09490 నెంబర్ లను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







