'ప్రేమమ్‌' టీం నార్వేలో

- July 17, 2016 , by Maagulf
'ప్రేమమ్‌' టీం నార్వేలో

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమమ్‌'. ఈ చిత్ర బృందం ప్రస్తుతం నార్వేలో ఉన్నట్లు తెలుస్తోంది. కథానాయకి శ్రుతిహాసన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా నార్వేలో నాగచైతన్య, చందు మొండేటితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నార్వేలో ప్రేమమ్‌ టీంతో చాలా సంతోషంగా గడిపానని పోస్ట్‌ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, మడొన్నా సెబాస్టియన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com