రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
- August 12, 2025
అమరావతి: అమరావతిలో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన దిశగా మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని పరిధిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది.
తుళ్లూరు–అనంతవరం గ్రామాల మధ్య విస్తరించిన 21 ఎకరాల భూమిపై ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA) తాజాగా కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నటుడు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.ఆయనే ఈ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా కృషి చేస్తున్నారు.
అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభ దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు.తర్వాత దాన్ని 1000 పడకల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉందని సమాచారం.
ఈ ఆసుపత్రికి సంబంధించి తొలి ప్రణాళికలు 2014–2019 కాలంలోనే రూపొందినవే. అప్పట్లోనే భూమి కేటాయించినప్పటికీ, 2019లో పాలన మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి భూమి కేటాయించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!







