రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
- August 12, 2025
అమరావతి: అమరావతిలో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన దిశగా మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని పరిధిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది.
తుళ్లూరు–అనంతవరం గ్రామాల మధ్య విస్తరించిన 21 ఎకరాల భూమిపై ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA) తాజాగా కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నటుడు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.ఆయనే ఈ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా కృషి చేస్తున్నారు.
అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభ దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు.తర్వాత దాన్ని 1000 పడకల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉందని సమాచారం.
ఈ ఆసుపత్రికి సంబంధించి తొలి ప్రణాళికలు 2014–2019 కాలంలోనే రూపొందినవే. అప్పట్లోనే భూమి కేటాయించినప్పటికీ, 2019లో పాలన మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి భూమి కేటాయించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









