తెలంగాణ: మంత్రుల కమిటీ ఏర్పాటు!
- August 13, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల ఆమోదం, పర్యవేక్షణలో క్రమబద్ధత తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే కొనసాగుతున్న పనులు, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు మంత్రుల కమిటీ అనుమతి తప్పనిసరి కానుంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ రాష్ట్రంలోని అభివృద్ధి పనుల మంజూర్లు, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై సమగ్ర పర్యవేక్షణ చేస్తుంది. ఇకపై ఏ పనికైనా ఈ కమిటీ ఆమోదం లేకుండా అమలు చేయరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!







