కువైట్ లో పెరుగుతున్న ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య..!!
- August 14, 2025
కువైట్: కువైట్ లో ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆల్కహాల్ విషప్రయోగం కారణంగా 63 కేసులు నమోదైనట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 40 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది.
ఇప్పటివరకు 13మంది మరణించగా.. వీరిలో 10 మంది భారతీయులు మరియు 2 నేపాలీలు ఉన్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 31 మందికి వెంటిలేటర్ సహాయం అవసరం కాగా, 51 మందికి అత్యవసరంగా కిడ్నీ డయాలసిస్ సెషన్లు జరిగాయని పేర్కొంది. 21 మంది శాశ్వత అంధత్వం లేదా దృష్టి లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.
కువైట్లోని భారత రాయబార కార్యాలయం +965-65501587 అనే హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. ఏవైనా అనుమానిత కేసులను అత్యవసర హాట్లైన్ల ద్వారా వెంటనే నివేదించాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!









