కువైట్ లో పెరుగుతున్న ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య..!!

- August 14, 2025 , by Maagulf
కువైట్ లో పెరుగుతున్న ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య..!!

కువైట్: కువైట్ లో ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆల్కహాల్ విషప్రయోగం కారణంగా 63 కేసులు నమోదైనట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 40 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది.

ఇప్పటివరకు 13మంది మరణించగా.. వీరిలో 10 మంది భారతీయులు మరియు 2 నేపాలీలు ఉన్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 31 మందికి  వెంటిలేటర్ సహాయం అవసరం కాగా, 51 మందికి అత్యవసరంగా కిడ్నీ డయాలసిస్ సెషన్లు జరిగాయని పేర్కొంది. 21 మంది శాశ్వత అంధత్వం లేదా దృష్టి లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం +965-65501587 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది.  ఏవైనా అనుమానిత కేసులను అత్యవసర హాట్‌లైన్‌ల ద్వారా వెంటనే నివేదించాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com