కువైట్ లో పెరుగుతున్న ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య..!!
- August 14, 2025
కువైట్: కువైట్ లో ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆల్కహాల్ విషప్రయోగం కారణంగా 63 కేసులు నమోదైనట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 40 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది.
ఇప్పటివరకు 13మంది మరణించగా.. వీరిలో 10 మంది భారతీయులు మరియు 2 నేపాలీలు ఉన్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 31 మందికి వెంటిలేటర్ సహాయం అవసరం కాగా, 51 మందికి అత్యవసరంగా కిడ్నీ డయాలసిస్ సెషన్లు జరిగాయని పేర్కొంది. 21 మంది శాశ్వత అంధత్వం లేదా దృష్టి లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.
కువైట్లోని భారత రాయబార కార్యాలయం +965-65501587 అనే హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. ఏవైనా అనుమానిత కేసులను అత్యవసర హాట్లైన్ల ద్వారా వెంటనే నివేదించాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!