గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్.. ఖండించిన 31 అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- August 16, 2025
దోహా: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ ప్రకటనను 31 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. వీటితోపాటు అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్లు కూడా ఇజ్రాయెల్ వ్యాఖ్యలను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్ట నియమాలను , అంతర్జాతీయ సంబంధాల పునాదులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని.. ఇజ్రాయెల్ ధోరణి అరబ్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుందని స్పష్టం చేశాయి.
జూన్ 4, 1967న నాటి ఒప్పందం ప్రకారం..ఆక్రమిత జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర, సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేశాయి. గాజా స్ట్రిప్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అంతర్భాగమని చెప్పాయి. అంతర్జాతీయ మద్దతుతో పాలస్తీనా ను ఏర్పాటు చేయాలని కోరాయి. అమెరికా, భద్రతా మండలి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై కొనసాగుతున్న దురాక్రమణను అడ్డుకోవాలని, శాంతియుత పద్ధతుల్లో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









