రియాద్ లో 84 సంస్థలు మూసివేత..!!
- August 17, 2025
రియాద్ః రియాద్ మేయరాల్టీ మన్ఫుహా పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 84 సంస్థలను మూసివేసింది. అదే సమయంలో మేయాల్టీ 531 నోటీసులను జారీ చేసింది. 11 సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది. 5,322 కిలోల ఆహార పదార్థాలు మరియు 25 కిలోల పొగాకు ఉత్పత్తులను డెస్ట్రాయ్ చేయడంతో పాటు, మానవ వినియోగానికి పనికిరాని 31,620 ఉత్పత్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా మొత్తం పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాల్టీ తన "మాడినాటి" యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు, మాంసం షాపులు, కేఫ్ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. "మాడినాటి" యాప్ ద్వారా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









