బహ్రెయిన్ లో ఈవినింగ్ సెకండరీ స్కూల్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- August 17, 2025
మనమా: 2025/2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈవినింగ్ సెకండరీ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ ప్రారంభమై.. 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. దరఖాస్తులను మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలని, అందుబాటులో ఉన్న సీట్లను సామర్థ్యం ఆధారంగా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. దరఖాస్తుదారులు తమ పత్రాలను షేక్ ఇసా బిన్ అలీ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద అధికారులకు సమర్పించాలన్నారు. కాగా, మహిళా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను రిఫా వెస్ట్ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ మెయిల్ కు పంపాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 17896955, 17896927, 17896922, లేదా 17897274 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







