డాలస్లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 17, 2025
డాలస్లో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ...
“మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సమరయోధుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది. గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల కృషి ఎన్నటికీ కొనియాడదగినదే” అని అన్నారు.
శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయం వేళ పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరుకావడం వారి మాతృదేశభక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అనంతరం అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన సున్నిండలు ఉండగా, వాటిని ఆస్వాదిస్తూ అందరి ముఖాల్లో ఆనందభావాలు కనబడ్డాయి.
బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







