చెన్నై టీ.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
- August 17, 2025
తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం చెన్నై టీ.నగర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీ.నగర్ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గర్భాలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులను ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించినట్టు తెలిపారు. త్వరలో లోకల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి చెన్నైలోని రెండు టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మించాలని సంకల్పించామని, ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఆలయాలు ఉండగా మిగతా రాష్ట్రాల్లో స్థల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుమరగురు, మాజీ ఎల్ఏసి చైర్మన్లు శేఖర్ రెడ్డి, నూతలపాటి కృష్ణ, మాజీ సభ్యులు చంద్రశేఖర్,శంకర్ తదితరులు పాల్గొని చైర్మన్ను సన్మానించారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







