చెన్నై టీ.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
- August 17, 2025
తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం చెన్నై టీ.నగర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీ.నగర్ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గర్భాలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులను ప్రణాళిక సిద్ధం చేయమని ఆదేశించినట్టు తెలిపారు. త్వరలో లోకల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి చెన్నైలోని రెండు టీటీడీ ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మించాలని సంకల్పించామని, ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఆలయాలు ఉండగా మిగతా రాష్ట్రాల్లో స్థల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుమరగురు, మాజీ ఎల్ఏసి చైర్మన్లు శేఖర్ రెడ్డి, నూతలపాటి కృష్ణ, మాజీ సభ్యులు చంద్రశేఖర్,శంకర్ తదితరులు పాల్గొని చైర్మన్ను సన్మానించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







