అల్-షఖౌరా మర్డర్ కేసులో నిందితుడికి మరణశిక్ష..!!
- August 18, 2025
మనామాః బహ్రెయిన్ లోని అల్-షఖౌరాలో మర్డర్ కేసులో దోషిగా తేలిన నిందితుడిని ఎగ్జామిన్ చేసిన వైద్య కమిటీ మెంబర్స్ నుండి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నేరం జరిగిన సమయంలో నిందితుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, అన్ని తెలిసే మర్డర్ కు ప్లాన్ చేశాడని నిపుణులు తెలిపారు.మొదటి హై క్రిమినల్ కోర్ట్ గతంలో జారీ చేసిన మరణశిక్షను ఖరారు చేయాలని కోర్టును కోరారు.
గతంలో నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశాడని, హత్య ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడని, దానిని తన దుస్తులలో దాచాడని, చేతి గ్లవుస్ ధరించాడని మరియు తరువాత కత్తిని పారవేసాడని ప్యానెల్ కోర్టుకు వివరించింది.
కాగా, మొదటి హై క్రిమినల్ కోర్టు గతంలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఏకగ్రీవ నిర్ణయంతో అతనికి మరణశిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







