అల్-షఖౌరా మర్డర్ కేసులో నిందితుడికి మరణశిక్ష..!!
- August 18, 2025
మనామాః బహ్రెయిన్ లోని అల్-షఖౌరాలో మర్డర్ కేసులో దోషిగా తేలిన నిందితుడిని ఎగ్జామిన్ చేసిన వైద్య కమిటీ మెంబర్స్ నుండి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నేరం జరిగిన సమయంలో నిందితుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, అన్ని తెలిసే మర్డర్ కు ప్లాన్ చేశాడని నిపుణులు తెలిపారు.మొదటి హై క్రిమినల్ కోర్ట్ గతంలో జారీ చేసిన మరణశిక్షను ఖరారు చేయాలని కోర్టును కోరారు.
గతంలో నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశాడని, హత్య ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడని, దానిని తన దుస్తులలో దాచాడని, చేతి గ్లవుస్ ధరించాడని మరియు తరువాత కత్తిని పారవేసాడని ప్యానెల్ కోర్టుకు వివరించింది.
కాగా, మొదటి హై క్రిమినల్ కోర్టు గతంలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఏకగ్రీవ నిర్ణయంతో అతనికి మరణశిక్షను విధించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







