అల్-షఖౌరా మర్డర్ కేసులో నిందితుడికి మరణశిక్ష..!!
- August 18, 2025
మనామాః బహ్రెయిన్ లోని అల్-షఖౌరాలో మర్డర్ కేసులో దోషిగా తేలిన నిందితుడిని ఎగ్జామిన్ చేసిన వైద్య కమిటీ మెంబర్స్ నుండి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నేరం జరిగిన సమయంలో నిందితుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, అన్ని తెలిసే మర్డర్ కు ప్లాన్ చేశాడని నిపుణులు తెలిపారు.మొదటి హై క్రిమినల్ కోర్ట్ గతంలో జారీ చేసిన మరణశిక్షను ఖరారు చేయాలని కోర్టును కోరారు.
గతంలో నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశాడని, హత్య ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడని, దానిని తన దుస్తులలో దాచాడని, చేతి గ్లవుస్ ధరించాడని మరియు తరువాత కత్తిని పారవేసాడని ప్యానెల్ కోర్టుకు వివరించింది.
కాగా, మొదటి హై క్రిమినల్ కోర్టు గతంలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఏకగ్రీవ నిర్ణయంతో అతనికి మరణశిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









