అబుదాబిలో నవజాత శిశువుల జన్యు పరీక్షలు ప్రారంభం..!!
- August 18, 2025
యూఏఈ: అబుదాబి ఆరోగ్య మంత్రిత్వశాఖ నవజాత శిశువుల జన్యు పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన కార్యక్రమాలలో దీనిని ఒకటిగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 815 కి పైగా చికిత్స చేయగల జన్యు సంబంధిత జబ్బుల కోసం నవజాత శిశువులను పరీక్షిస్తారు. వీటిలో జీవక్రియలో సమస్యలు, రోగనిరోధక శక్తి లోపాలు, రక్త సంబంధిత జబ్బులు, వెన్నెముక కండరాల సమస్యలు వంటి అరుదైన జెనటిక్ సంబంధిత వ్యాధులను ముందుగానే తెలుసుకుంటారు.
నవజాత శిశువు తల్లిదండ్రుల సమ్మతితో, వైద్యులు పుట్టిన సమయంలో బొడ్డుతాడు నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీని ద్వారా జన్యుపరమైన పరిస్థితులను ముందుగానే గుర్తించవచ్చని అబుదాబి ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖామిస్ అల్ ఘైతి అన్నారు. అయితే, ప్రారంభ దశలో M42 భాగస్వామ్యంతో కనద్ హాస్పిటల్ మరియు దానత్ అల్ ఎమరాత్ హాస్పిటల్లో స్వచ్ఛందంగా స్క్రీనింగ్ అందించబడుతోందన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









