అబుదాబిలో నవజాత శిశువుల జన్యు పరీక్షలు ప్రారంభం..!!
- August 18, 2025
యూఏఈ: అబుదాబి ఆరోగ్య మంత్రిత్వశాఖ నవజాత శిశువుల జన్యు పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన కార్యక్రమాలలో దీనిని ఒకటిగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 815 కి పైగా చికిత్స చేయగల జన్యు సంబంధిత జబ్బుల కోసం నవజాత శిశువులను పరీక్షిస్తారు. వీటిలో జీవక్రియలో సమస్యలు, రోగనిరోధక శక్తి లోపాలు, రక్త సంబంధిత జబ్బులు, వెన్నెముక కండరాల సమస్యలు వంటి అరుదైన జెనటిక్ సంబంధిత వ్యాధులను ముందుగానే తెలుసుకుంటారు.
నవజాత శిశువు తల్లిదండ్రుల సమ్మతితో, వైద్యులు పుట్టిన సమయంలో బొడ్డుతాడు నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీని ద్వారా జన్యుపరమైన పరిస్థితులను ముందుగానే గుర్తించవచ్చని అబుదాబి ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖామిస్ అల్ ఘైతి అన్నారు. అయితే, ప్రారంభ దశలో M42 భాగస్వామ్యంతో కనద్ హాస్పిటల్ మరియు దానత్ అల్ ఎమరాత్ హాస్పిటల్లో స్వచ్ఛందంగా స్క్రీనింగ్ అందించబడుతోందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







