గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!
- August 19, 2025
దుబాయ్: $25 మిలియన్ల విలువైన విలువైన పింక్ డైమండ్ ను దొంగిలించిన కొన్ని గంటలకే పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. యూరప్ నుండి ఆభరణాన్ని తీసుకువచ్చిన వజ్ర వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించారని, దానిని కొనుగోలు చేసే నెపంతో నేరస్థుల ముఠా అతడిని విల్లాకు ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. అక్కడికి రాగానే పింక్ డైమండ్ ను ముఠా సభ్యులు చోరీ చేసి పరారు అయ్యారని అన్నారు. చోరీ జరిగిన ఎనిమిది గంటల్లోపే సీసీ ఫుటేజీలను పరిశీలిచడం ద్వారా ముగ్గురు వ్యక్తులను ట్రేస్ చేసి అరెస్టు చేసి, అరుదైన పింక్ డైమండ్ ను రికవరి చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







