గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!

- August 19, 2025 , by Maagulf
గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!

దుబాయ్: $25 మిలియన్ల విలువైన విలువైన పింక్ డైమండ్ ను దొంగిలించిన కొన్ని గంటలకే పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. యూరప్ నుండి ఆభరణాన్ని తీసుకువచ్చిన వజ్ర వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించారని, దానిని కొనుగోలు చేసే నెపంతో నేరస్థుల ముఠా అతడిని విల్లాకు ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. అక్కడికి రాగానే పింక్ డైమండ్ ను ముఠా సభ్యులు చోరీ చేసి పరారు అయ్యారని అన్నారు.  చోరీ జరిగిన ఎనిమిది గంటల్లోపే సీసీ ఫుటేజీలను పరిశీలిచడం ద్వారా ముగ్గురు వ్యక్తులను  ట్రేస్ చేసి అరెస్టు చేసి, అరుదైన పింక్ డైమండ్ ను రికవరి చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com