Dh100,000 గెలుచుకున్న యూఏఈ వాసి..!!
- August 21, 2025
యూఏఈ: గత ఐదు నెలలుగా యూఏఈ లాటరీ ఆడుతున్న యూఏఈ వాసిని అధృష్టం పలకరించింది. అబ్దుల్లా అలీ గరీబ్ జూన్ నెలకు సంబంధించి వన్ హండ్రెడ్ థౌజండ్స్ దిర్హామ్స్ గెలుచుకున్నారు. మొదట్లో తాను నమ్మలేదని, అనేక సార్లు తనిఖీ చేశాకే విజయం దక్కిందని నమ్మినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డబ్బుతో తన కారును అప్గ్రేడ్ చేస్తానని తెలిపాడు. తన వద్ద ఇప్పటికే ఉన్న కారును విక్రయించి కొత్త కారును తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఆ లాటరీ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. ఇది వారం రోజులకు ఒకసారి భారీ 100-మిలియన్ దిర్హామ్స్ జాక్పాట్ను అందిస్తుంది. అలాగే సరిపోలిన అంకెల సంఖ్యను బట్టి 100 నుండి 100 మిలియన్ల దిర్హామ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. గత నెలలో, ఇది నాలుగు కొత్త స్క్రాచ్కార్డ్లను ప్రారంభించింది. వీటి ద్వారా వన్ మిలియన్ దిర్హామ్స్ వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







