Dh100,000 గెలుచుకున్న యూఏఈ వాసి..!!
- August 21, 2025
యూఏఈ: గత ఐదు నెలలుగా యూఏఈ లాటరీ ఆడుతున్న యూఏఈ వాసిని అధృష్టం పలకరించింది. అబ్దుల్లా అలీ గరీబ్ జూన్ నెలకు సంబంధించి వన్ హండ్రెడ్ థౌజండ్స్ దిర్హామ్స్ గెలుచుకున్నారు. మొదట్లో తాను నమ్మలేదని, అనేక సార్లు తనిఖీ చేశాకే విజయం దక్కిందని నమ్మినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డబ్బుతో తన కారును అప్గ్రేడ్ చేస్తానని తెలిపాడు. తన వద్ద ఇప్పటికే ఉన్న కారును విక్రయించి కొత్త కారును తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఆ లాటరీ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. ఇది వారం రోజులకు ఒకసారి భారీ 100-మిలియన్ దిర్హామ్స్ జాక్పాట్ను అందిస్తుంది. అలాగే సరిపోలిన అంకెల సంఖ్యను బట్టి 100 నుండి 100 మిలియన్ల దిర్హామ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. గత నెలలో, ఇది నాలుగు కొత్త స్క్రాచ్కార్డ్లను ప్రారంభించింది. వీటి ద్వారా వన్ మిలియన్ దిర్హామ్స్ వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









