మనీలాండరింగ్ కేసులో దోషులుగా 18 మంది..!!
- August 22, 2025
యూఏఈ: దుబాయ్ అనే లా సంస్థను లక్ష్యంగా చేసుకుని మల్టీ-మిలియన్ల దిర్హామ్ల దుర్వినియోగమైన మనీలాండరింగ్ పథకంలో వివిధ దేశాలకు చెందిన 18 మందిని దుబాయ్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులు సంస్థ నుండి మొత్తం 185 మిలియన్ దిర్హామ్లను దొంగిలించారని తెలిపింది. యూఏఈతోపాటు వివిధ దేశాలలో నకిలీ కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా నిందితులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారు. అదేసమయంలో దొంగిలించిన డబ్బును మూడు షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేసినందుకు కూడా ఈ బృందం సభ్యులను కోర్టు దోషిగా నిర్ధారించింది.
నలుగురికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, తరువాత బహిష్కరణ, మిగిలిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు బహిష్కరణ వేటు వేశారు. ఇద్దరికి ఒక్కొక్కరికి దిర్హామ్లు 20,000 జరిమానా విధించగా, ఈ పథకంతో సంబంధం ఉన్న మూడు కంపెనీలకు ఒక్కింటికి 500,000 దిర్హామ్లు జరిమానా విధించారు. తగినంత సాక్ష్యాలు లేనందున మరో నలుగురు వ్యక్తులను నిర్దోషులుగా విడుదల చేశారు.
నిందితుల ముఠా తన క్లయింట్లను మోసం చేయడానికి నకిలీ పత్రాలు, నకిలీ ఇమెయిల్ చిరునామాలు, లా ఫర్మ్ వలె నకిలీ స్టేషనరీలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారు సంస్థ క్లయింట్ డేటాబేస్ను కాపీ చేశారని, సంస్థతో లావాదేవీలు కలిగి ఉన్న అంతర్జాతీయ కంపెనీలను సంప్రదించారని,వారి స్వంత కంపెనీల నియంత్రణలో ఉన్న ఖాతాల్లోకి చెల్లింపులను మళ్లించారని కోర్టు తన తీర్పు వెల్లడించింది. అలాగే, దోషులుగా తేలిన నిందితులందరి నుండి దిర్హామ్లు 113.65 మిలియన్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ తీర్పును దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







