పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే..15 రోజులపాటు మూసివేత..!!
- August 22, 2025
దోహా: ఖతార్ లో నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాలు, సంస్థలు పనిచేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొంది. పాదచారులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం, నిబంధనలను పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడితే.. ఖతార్ లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం..ఆయా సంస్థలను 15 రోజులపాటు మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో వెల్లడించింది.
మరోవైపు ఖతార్ వ్యాప్తంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని అనెక రెస్టారెంట్లతోపాటు పలు ఫుడ్ ఆధారిత కంపెనీలను మూసివేయించారు. ప్రజారోగ్యానికి , వినియోగదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించబడుతున్న పద్ధతులను సహించమని స్పష్టం చేసింది. 16001లో హాట్లైన్ను సంప్రదించడం ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించడం లేదా మంత్రిత్వశాఖ అప్లికేషన్ను ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









