పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే..15 రోజులపాటు మూసివేత..!!
- August 22, 2025
దోహా: ఖతార్ లో నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాలు, సంస్థలు పనిచేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొంది. పాదచారులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం, నిబంధనలను పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడితే.. ఖతార్ లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం..ఆయా సంస్థలను 15 రోజులపాటు మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో వెల్లడించింది.
మరోవైపు ఖతార్ వ్యాప్తంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని అనెక రెస్టారెంట్లతోపాటు పలు ఫుడ్ ఆధారిత కంపెనీలను మూసివేయించారు. ప్రజారోగ్యానికి , వినియోగదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించబడుతున్న పద్ధతులను సహించమని స్పష్టం చేసింది. 16001లో హాట్లైన్ను సంప్రదించడం ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించడం లేదా మంత్రిత్వశాఖ అప్లికేషన్ను ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







