న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!
- August 27, 2025
కువైట్: భారత్ -కువైట్ విదేశాంగ కార్యాలయ 7వ రౌండ్ సంప్రదింపుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్. మహాజన్ మరియు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి గౌరవ రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు. పలు ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయ సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంధనం, సంస్కృతి ,ప్రజల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి.
2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్మ్యాప్ అమలును కొనసాగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. పరస్పరం అనుకూలమైన తేదీలలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ కింద జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అంగీకరించారు.
కాగా, భారత్- కువైట్ చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–2025 ఆర్థిక సంవత్సరంలో USD 10.2 బిలియన్లుగా నమోదైంది. కువైట్లో పది లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







