న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!
- August 27, 2025
కువైట్: భారత్ -కువైట్ విదేశాంగ కార్యాలయ 7వ రౌండ్ సంప్రదింపుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్. మహాజన్ మరియు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి గౌరవ రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు. పలు ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయ సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంధనం, సంస్కృతి ,ప్రజల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి.
2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్మ్యాప్ అమలును కొనసాగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. పరస్పరం అనుకూలమైన తేదీలలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ కింద జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అంగీకరించారు.
కాగా, భారత్- కువైట్ చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–2025 ఆర్థిక సంవత్సరంలో USD 10.2 బిలియన్లుగా నమోదైంది. కువైట్లో పది లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







