న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!
- August 27, 2025
కువైట్: భారత్ -కువైట్ విదేశాంగ కార్యాలయ 7వ రౌండ్ సంప్రదింపుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్. మహాజన్ మరియు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి గౌరవ రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు. పలు ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయ సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంధనం, సంస్కృతి ,ప్రజల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి.
2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్మ్యాప్ అమలును కొనసాగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. పరస్పరం అనుకూలమైన తేదీలలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ కింద జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అంగీకరించారు.
కాగా, భారత్- కువైట్ చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–2025 ఆర్థిక సంవత్సరంలో USD 10.2 బిలియన్లుగా నమోదైంది. కువైట్లో పది లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









