న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!
- August 27, 2025
కువైట్: భారత్ -కువైట్ విదేశాంగ కార్యాలయ 7వ రౌండ్ సంప్రదింపుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్. మహాజన్ మరియు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి గౌరవ రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు. పలు ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయ సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంధనం, సంస్కృతి ,ప్రజల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి.
2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్మ్యాప్ అమలును కొనసాగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. పరస్పరం అనుకూలమైన తేదీలలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ కింద జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అంగీకరించారు.
కాగా, భారత్- కువైట్ చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–2025 ఆర్థిక సంవత్సరంలో USD 10.2 బిలియన్లుగా నమోదైంది. కువైట్లో పది లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







