విద్యార్థుల భద్రతకు ROP సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక..!!
- August 28, 2025
మస్కట్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయనుంది. పాఠశాలల చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు విద్యార్థుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ సలీం అల్ ఫలాహి తెలిపారు. ఈ ప్రణాళికలో ప్రధాన రోడ్లు, వంతెనలు, కూడళ్లు మరియు పాఠశాలల సమీపంలో పోలీసుల సంఖ్యను పెంచడం వంటివి ఉన్నాయని అన్నారు. విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని ఆయన చెప్పారు.
విద్యా మంత్రిత్వ శాఖ, రహదారి భద్రతా సంస్థల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఇప్పటికే స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం సమాజ బాధ్యతను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరియు తల్లిదండ్రులకు శిక్షణను అన్ని గవర్నరేట్లలో విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వర్క్షాప్లు, సోషల్ మీడియా, పాఠశాల కార్యకలాపాలు మరియు విద్యా సామగ్రి పంపిణీ ద్వారా అవగాహన ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు.
విద్యార్థుల్లో సురక్షితమైన ప్రవర్తనను పెంపొందించేందుకు ఇంటరాక్టివ్ కంటెంట్తో 8 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిని లక్ష్యంగా చేసుకుని "వయా రోడ్ సేఫ్టీ" కార్యక్రమం ద్వారా షెల్ ఒమన్తో సహా ప్రైవేట్ రంగ భాగస్వాములతో కూడా ROP పనిచేస్తోందన్నారు. పాఠశాలల దగ్గర వేగాన్ని తగ్గించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వాహనదారులకు ట్రాఫిక్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ స్టాఫ్ ఖమీస్ బిన్ అలీ అల్ బటాషి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!