విద్యార్థుల భద్రతకు ROP సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక..!!
- August 28, 2025
మస్కట్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయనుంది. పాఠశాలల చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు విద్యార్థుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ సలీం అల్ ఫలాహి తెలిపారు. ఈ ప్రణాళికలో ప్రధాన రోడ్లు, వంతెనలు, కూడళ్లు మరియు పాఠశాలల సమీపంలో పోలీసుల సంఖ్యను పెంచడం వంటివి ఉన్నాయని అన్నారు. విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని ఆయన చెప్పారు.
విద్యా మంత్రిత్వ శాఖ, రహదారి భద్రతా సంస్థల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఇప్పటికే స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం సమాజ బాధ్యతను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరియు తల్లిదండ్రులకు శిక్షణను అన్ని గవర్నరేట్లలో విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వర్క్షాప్లు, సోషల్ మీడియా, పాఠశాల కార్యకలాపాలు మరియు విద్యా సామగ్రి పంపిణీ ద్వారా అవగాహన ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు.
విద్యార్థుల్లో సురక్షితమైన ప్రవర్తనను పెంపొందించేందుకు ఇంటరాక్టివ్ కంటెంట్తో 8 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిని లక్ష్యంగా చేసుకుని "వయా రోడ్ సేఫ్టీ" కార్యక్రమం ద్వారా షెల్ ఒమన్తో సహా ప్రైవేట్ రంగ భాగస్వాములతో కూడా ROP పనిచేస్తోందన్నారు. పాఠశాలల దగ్గర వేగాన్ని తగ్గించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వాహనదారులకు ట్రాఫిక్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ స్టాఫ్ ఖమీస్ బిన్ అలీ అల్ బటాషి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







