ప్రభుత్వ నిర్వహణలోని తొలి కిండర్ గార్టెన్..!!
- August 30, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఈ విద్యా సంవత్సరం (2025-26) అల్-జివాన్ కిండర్ గార్టెన్ను ప్రారంభించనుంది. ఇది ప్రత్యేక అవసరాలు మరియు ప్రారంభ లెర్నింగ్ సవాళ్లతో ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన ఖతార్ మొట్టమొదటి ప్రభుత్వ నిర్వహణలోని కిండర్ గార్టెన్గా ఇది గుర్తింపు పొందనుంది. పిల్లలు అభివృద్ధి మరియు లెర్నింగ్ సవాళ్లను అధిగమించడానికి కిండర్ గార్టెన్ ప్రత్యేక కార్యక్రమాలు మరియు వనరులను అందించనుందని మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి తెలిపారు.
ఖతార్లోని వివిధ ప్రాంతాలలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో ఎనిమిది కొత్త పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలు ఆధునిక, అధిక-నాణ్యత విద్యను అందించడానికి అధునాతన మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలలో పోటీ పడగల కొత్త తరం విద్యార్థులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ అల్ నుయిమి అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









