ప్రభుత్వ నిర్వహణలోని తొలి కిండర్ గార్టెన్..!!
- August 30, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఈ విద్యా సంవత్సరం (2025-26) అల్-జివాన్ కిండర్ గార్టెన్ను ప్రారంభించనుంది. ఇది ప్రత్యేక అవసరాలు మరియు ప్రారంభ లెర్నింగ్ సవాళ్లతో ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన ఖతార్ మొట్టమొదటి ప్రభుత్వ నిర్వహణలోని కిండర్ గార్టెన్గా ఇది గుర్తింపు పొందనుంది. పిల్లలు అభివృద్ధి మరియు లెర్నింగ్ సవాళ్లను అధిగమించడానికి కిండర్ గార్టెన్ ప్రత్యేక కార్యక్రమాలు మరియు వనరులను అందించనుందని మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి తెలిపారు.
ఖతార్లోని వివిధ ప్రాంతాలలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో ఎనిమిది కొత్త పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలు ఆధునిక, అధిక-నాణ్యత విద్యను అందించడానికి అధునాతన మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలలో పోటీ పడగల కొత్త తరం విద్యార్థులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ అల్ నుయిమి అన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









