భారత్ తో వాణిజ్య ఒప్పంద చర్చలకు ఖతార్ సిద్ధంగా ఉంది: పియూష్ గోయల్
- August 30, 2025
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అధికారిక పర్యటన సందర్భంగా భారతదేశంతో వాణిజ్య ఒప్పంద చర్చలను ప్రారంభించడానికి ఖతార్ సిద్ధంగా ఉందని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అన్నారు. రెండు దేశాల మధ్య మెరుగైన వాణిజ్యం కోసం వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వస్తువులు మరియు సేవల వాణిజ్యానికి సంబంధించిన మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు అంగీకరించాయని తెలిపారు. ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలోకి ప్రవేశించే అవకాశాన్ని అన్వేషించడానికి రెండు పక్షాలు నిర్ణయించాయని, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు పక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని గోయల్ వెల్లడించారు.
2023లో ప్రారంభమైన భారత్ -ఒమన్ మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ఇటీవల ముగిశాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా భారతదేశం తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుందని, ఐదు ప్రధాన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు)పై సంతకం చేసిందన్నారు. అనేక కొత్త ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









