షార్జా ఆత్మహత్య కేసు.. కొత్త ఆధారాల వీడియో వైరల్..!!
- September 01, 2025
యూఏఈ: గత నెలలో షార్జాలో మరణించిన భారతీయ మహిళ కేసులో కొత్త ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు కేరళ మీడియాలోకొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు తీసిన ఈ వీడియోలో మృతురాలు అతుల్య శేఖర్ ఏడుస్తూ, టేబుల్ చుట్టూ పరిగెడుతూ ఉండగా.. ఆమె భర్త సతీష్ శంకర్ ఆమెను కొడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
అతుల్య తన 30వ పుట్టినరోజు జరుపుకున్న ఒక రోజు తర్వాత షార్జాలోని రోల్లాలోని తన ఫ్లాట్లో చనిపోయి కనిపించింది. షార్జా అధికారులు భారతీయ ప్రవాసి ఆత్మహత్య చేసుకుని మరణించిందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రులు సతీష్పై డొమెస్టిక్ వయలెన్స్ కేసులు బుక్ చేయించారు. తాజాగా తమ వాదనకు మద్దతుగా కొత్త ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఆ దంపతుల 10 ఏళ్ల కుమార్తె ఇప్పుడు అతుల్య తల్లిదండ్రులతో నివసిస్తోంది.
కాగా, ఈ నెల ప్రారంభంలో సతీష్ కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగగానే అరెస్టు చేవారు. 40 ఏళ్ల ఈ వ్యక్తి జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







