ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- September 01, 2025
కువైట్: కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ట్రాఫిక్ చట్టంలోని నిబంధనల సవరణకు ఆమోదం తెలిపారు. అధికారిక గెజిట్ లో ప్రచురించిన ఒక నెల తర్వాత అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
తాజా సవరణల ప్రకారం.. ఇది కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు సోషల్ సర్వీస్, అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొనే శిక్షలను విధించనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ జరిమానాలను విధించనున్నారు.
వీటితోపాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, విద్యా మంత్రిత్వ శాఖ కింద పాఠశాలలు మరియు అవగాహన డ్రైవ్లను నిర్వహించడంలో సహాయం చేయడం, మసీదులను శుభ్రపరచడం మరియు చెట్ల పెంపకం, తీరప్రాంతాలను శుభ్రపరచడం మరియు పర్యావరణ అథారిటీతో కలిసి పనిచేయడం, NGOల ద్వారా కమ్యూనిటీ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు విధించనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!







