ఖతార్లో హెల్తీ అలవాట్లపై MOPH అప్పీల్..!!
- September 02, 2025
దోహా: ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది.
పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలను తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండుసార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి.
పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటిపట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







