ఖతార్లో హెల్తీ అలవాట్లపై MOPH అప్పీల్..!!
- September 02, 2025
దోహా: ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది.
పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలను తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండుసార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి.
పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటిపట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







