ఖతార్లో హెల్తీ అలవాట్లపై MOPH అప్పీల్..!!
- September 02, 2025
దోహా: ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది.
పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలను తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండుసార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి.
పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటిపట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









