భద్రతాపరమైన సవాళ్లపై సలాలాలో సింపోజియం..!!
- September 02, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లోని సుల్తాన్ కబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో కీలకమైన సౌకర్యాల భద్రతపై 4వ సింపోజియం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సింపోజియంను సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
వివిధ రకాలైన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లపై ఈ సింపోజియంలో చర్చిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం, భద్రతా సంస్థలు మరియు నిపుణుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా హాజరైన నిపుణులు చర్చిస్తున్నారు. ఈ సందర్భాంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, పరికరాలను ప్రదర్శిస్తున్నారు.
అలాగే, భద్రతలో ఏఐ పాత్ర, కార్యాలయాల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్ పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ సవాళ్లతోపాటు సైబర్ భద్రతపై పెద్దఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







