భద్రతాపరమైన సవాళ్లపై సలాలాలో సింపోజియం..!!
- September 02, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లోని సుల్తాన్ కబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో కీలకమైన సౌకర్యాల భద్రతపై 4వ సింపోజియం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సింపోజియంను సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
వివిధ రకాలైన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లపై ఈ సింపోజియంలో చర్చిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం, భద్రతా సంస్థలు మరియు నిపుణుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా హాజరైన నిపుణులు చర్చిస్తున్నారు. ఈ సందర్భాంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, పరికరాలను ప్రదర్శిస్తున్నారు.
అలాగే, భద్రతలో ఏఐ పాత్ర, కార్యాలయాల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్ పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ సవాళ్లతోపాటు సైబర్ భద్రతపై పెద్దఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









