సెమికాన్ ఇండియా-2025 ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- September 02, 2025
న్యూ ఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా-2025’ను ప్రారంభించారు. ఆనంతరం మోదీ సీఈవోల రౌంట్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్పు రోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్, ఆధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాలయ సంసిద్ధత, స్మార్ట్ తయారీ, ఆర్ అండ్ డి, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు వంటివాటన్నింటిపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాక డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్) పథకం కింద చొరవలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధి, అంతర్జాతీయ సమకారం, భారతదేశ సెమీకండక్టర్ రంగం కోసం భవిష్యత్తు రోడ్ మ్యాపు హైలైట్ చేయనున్నది.
ఈ కార్యక్రమానికి దాదాపు 48దేశాల నుంచి 2,500మందికి పైగా ప్రతినిధులు, 50మందికి పైగా ప్రపంచ నాయకులు, 350మందికి పైగా ప్రదర్శనకారులు సహా, 20,750 మందికిపైగా హాజరు అయ్యారు. ఇందులో 6దేశాల రౌండేబుల్ చర్చలు, కంట్రీ పెవిలియన్లు,(Country pavilions,) వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్టార్ట్-అప్ కోసం అంకితమైన పెవిలియన్లు కూడా ఉంటాయి. విశ్వ వ్యాప్తంగా నిర్వహించబడే సెమికాన్ సమావేశాలు, సెమీకండక్టర్ డొమైన్లో సాంకేతిక పురోగతిని, వారి సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ దేశాల విధానాలను గరిష్టంగా చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశీయంగా సెమీకండక్టర్ల డిజైన్, ఫ్యాబ్రికేషన్ మరియు ప్యాకేజింగ్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు.
సెమీకండక్టర్లు (చిప్స్) ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు మరియు ఇతర గృహోపకరణాలలో కీలకమైన భాగాలు. ప్రపంచ సాంకేతిక రంగంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









