సెమికాన్ ఇండియా-2025 ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- September 02, 2025
న్యూ ఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా-2025’ను ప్రారంభించారు. ఆనంతరం మోదీ సీఈవోల రౌంట్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్పు రోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్, ఆధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాలయ సంసిద్ధత, స్మార్ట్ తయారీ, ఆర్ అండ్ డి, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు వంటివాటన్నింటిపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాక డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్) పథకం కింద చొరవలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధి, అంతర్జాతీయ సమకారం, భారతదేశ సెమీకండక్టర్ రంగం కోసం భవిష్యత్తు రోడ్ మ్యాపు హైలైట్ చేయనున్నది.
ఈ కార్యక్రమానికి దాదాపు 48దేశాల నుంచి 2,500మందికి పైగా ప్రతినిధులు, 50మందికి పైగా ప్రపంచ నాయకులు, 350మందికి పైగా ప్రదర్శనకారులు సహా, 20,750 మందికిపైగా హాజరు అయ్యారు. ఇందులో 6దేశాల రౌండేబుల్ చర్చలు, కంట్రీ పెవిలియన్లు,(Country pavilions,) వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్టార్ట్-అప్ కోసం అంకితమైన పెవిలియన్లు కూడా ఉంటాయి. విశ్వ వ్యాప్తంగా నిర్వహించబడే సెమికాన్ సమావేశాలు, సెమీకండక్టర్ డొమైన్లో సాంకేతిక పురోగతిని, వారి సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ దేశాల విధానాలను గరిష్టంగా చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశీయంగా సెమీకండక్టర్ల డిజైన్, ఫ్యాబ్రికేషన్ మరియు ప్యాకేజింగ్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు.
సెమీకండక్టర్లు (చిప్స్) ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు మరియు ఇతర గృహోపకరణాలలో కీలకమైన భాగాలు. ప్రపంచ సాంకేతిక రంగంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







