ఆగష్టు 15న ధ్రువ. ఫస్ట్ లుక్ రిలీజ్..
- July 18, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్సింగ్ ప్రధాన పాత్రలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరు వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు లో సాంగ్స్ చిత్రీకరణ చేయనున్నారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చరణ్ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆసక్తికరమైన కథాంశంతో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ధృవ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఫెర్ఫార్మెన్స్, రకూల్ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనున్నాయి. ఆగష్టు 15న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని నిర్మాత తెలుపగా, త్వరలో టీజర్ ని అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









