ఆగష్టు 15న ధ్రువ. ఫస్ట్‌ లుక్ రిలీజ్..

- July 18, 2016 , by Maagulf
ఆగష్టు 15న ధ్రువ. ఫస్ట్‌ లుక్ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరు వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు లో సాంగ్స్ చిత్రీకరణ చేయనున్నారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చరణ్‌ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆసక్తికరమైన కథాంశంతో రామ్‌ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ధృవ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, రకూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనున్నాయి. ఆగష్టు 15న ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేస్తామని నిర్మాత తెలుపగా, త్వరలో టీజర్ ని అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com