HMC లో జెనటిక్ మ్యూటేషన్ టెస్టులు..!!
- September 05, 2025
దోహా: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఖతార్ మరింత బలోపేతం అయింది. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లోని లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) అధికారికంగా హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ (WES) పరీక్షను ప్రారంభించింది. ఈ సంచలనాత్మక పరీక్షలు జన్యు విశ్లేషణలో ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నారు. ఖతార్లోని రోగుల జన్యు ప్రొఫైల్కు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణలు చేయడంతోపాటు అత్యంత మెరుగైన చికిత్సలను అందించేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ కొత్త పరీక్షా టెక్నాలజీ పెద్దలు మరియు పిల్లలు, జన్యుపరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుందని మెడికల్ కార్పొరేషన్ వెల్లడించింది. గతంలో, ఈ పరీక్షల కోసం రోగుల రక్త నమూనాలను విదేశాలకు పంపాల్సి వచ్చేదని, దాంతో ఈ ప్రక్రియకు ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టేదని, ఇప్పుడా పరిస్థితి తప్పిందని, వేగంగా టెస్ట్ ఫలితాలను పొందవచ్చని DLMP చైర్ డాక్టర్ ఐనాస్ అబ్దులాజీజ్ అల్-కువారీ తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







