దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్..!
- September 04, 2025
న్యూ ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారాయన. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం అని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. వినియోగం, వృద్ధికి కొత్త బూస్టర్ డోస్ లభిస్తుందని ఆకాంక్షించారు. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత ముందే సాకారం అవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘మేడిన్ ఇండియాపై అందరూ ఆలోచించాలి. గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరం పాటిద్దాం. స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలి.
దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వపడాలి. మేడిన్ ఇండియాపై చిన్న, పెద్ద అందరూ ఆలోచించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలి.దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









