ఫుజైరాలో లైసెన్స్ లేని కంపెనీలకు జరిమానా..!!
- September 05, 2025
యూఏఈ: యూఏఈలో పర్యావరణ పరిరక్షణను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించివారిపై ఎమిరేట్లో పనిచేస్తున్న అనేక లైసెన్స్ లేని కంపెనీలకు ఫుజైరాలోని అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న అనేక కంపెనీలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ బృందాలు తెలిపాయి.
భూగర్భ జలాలను మరియు ఇతర ముఖ్యమైన నీటి వనరులను రక్షణకు చర్యలు చేపట్టనున్నారు. భూగర్భ జలాల వెలికితీత మరియు రక్షణను నియంత్రించే 2011 చట్టం, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని నియంత్రించే 1999 ఫెడరల్ చట్టం నంబర్ 24 ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఆయా కంపెనీలు తమ స్టేటస్ ను అత్యవసరంగా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.
ఈ కంపెనీ ఉల్లంఘనలతో పాటు, అనధికార వనరుల నుండి నీటి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తులను కూడా ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇటువంటి చర్యలు అధికారిక నిబంధనలకు విరుద్ధం అని ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







