బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!
- September 05, 2025
కువైట్: బ్యాంకు కస్టమర్లు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ షువైఖ్ జిల్లాలో వీరిపై అనేక కేసులు నమోదైనట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. బాధితులను ట్రాక్ చేసేందుకు నిందితులు ఫేక్ లైసెన్స్ ప్లేట్లతో కూడిన వాహనాలను వీరు ఉపయోగించుకున్నారని తెలిపారు. బ్యాంకుల వద్ద దొంగల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్-దజీజ్లోని ఒక బ్యాంకు సమీపంలో వాహనాల్లో అనుమానస్పదంగా ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







