పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!
- September 06, 2025
రియాద్: పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తీవ్రంగా ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి ఎవరు వెళ్లగొట్టలేరని, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి జారీ చేసిన బాధ్యతారహితమైన మరియు ప్రమాదకరమైన ప్రకటనలను GCC సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఒక ప్రకటనలో ఖండించారు. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, అన్ని దేశాలు ఈ ప్రమాదకరమైన పద్ధతులు, ప్రకటనలను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమైన, సమగ్ర శాంతిని సాధించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించే అవకాశాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







