పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!
- September 06, 2025
రియాద్: పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తీవ్రంగా ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి ఎవరు వెళ్లగొట్టలేరని, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి జారీ చేసిన బాధ్యతారహితమైన మరియు ప్రమాదకరమైన ప్రకటనలను GCC సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఒక ప్రకటనలో ఖండించారు. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, అన్ని దేశాలు ఈ ప్రమాదకరమైన పద్ధతులు, ప్రకటనలను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమైన, సమగ్ర శాంతిని సాధించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించే అవకాశాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం







