పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!
- September 06, 2025
రియాద్: పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తీవ్రంగా ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి ఎవరు వెళ్లగొట్టలేరని, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి జారీ చేసిన బాధ్యతారహితమైన మరియు ప్రమాదకరమైన ప్రకటనలను GCC సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఒక ప్రకటనలో ఖండించారు. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, అన్ని దేశాలు ఈ ప్రమాదకరమైన పద్ధతులు, ప్రకటనలను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమైన, సమగ్ర శాంతిని సాధించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించే అవకాశాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









