ఇండో-కువైటీ సంబంధాలపై బుక్ రిలీజ్..!!

- September 06, 2025 , by Maagulf
ఇండో-కువైటీ సంబంధాలపై బుక్ రిలీజ్..!!

కువైట్: ఇండో-కువైటీ సంబంధాలపై ప్రముఖ జర్నలిస్ట్ చైతాలి బెనర్జీ రాయ్ ఓ బుక్ రాశారు.  సదాకా: పార్టనర్‌షిప్ అండ్ కల్చరల్ కిన్‌షిప్ పేరుతో రాసిన బుక్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రసిద్ధ ఆడియోవిజువల్ సిరీస్ సదాకా మొదటి రెండు సీజన్‌లను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. ఇండియా-కువైట్ మధ్య శాశ్వత సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక బంధాలను తన కథనాల ద్వారా వివరించినట్లు వెల్లడించారు.   

రెండు దశాబ్దాలకు పైగా కువైట్‌లో పనిచేసిన ప్రముఖ సాంస్కృతిక జర్నలిస్ట్ చైతాలి బి రాయ్ రచించిన సదాకా.. ఉమెన్ ఆఫ్ కువైట్: టర్నింగ్ టైడ్స్ పేరుతో 2016లో తొలి పుస్తకం రాశారు. పుస్తకం ప్రముఖ పుస్తక కేంద్రాల్లో అందుబాటులో ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com