అజ్మాన్ లో పెట్రోల్ రవాణా వాహనాలపై ఆంక్షలు..!!
- September 08, 2025
యూఏఈ: అజ్మాన్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ రవాణా చేసే వాహనాలను ఇకపై జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తామని అజ్మాన్ సుప్రీం ఎనర్జీ కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మొదటి చేసిన నేరానికి 5,000 దిర్హామ్ల జరిమానా, అది పునరావృతం అయితే 10,000 దిర్హామ్ల జరిమానా, మూడోసారి నేరం పునరావృతమైతే20,000 దిర్హామ్ల జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తారు. అలాగే, ఆయా పెట్రోలియం సంస్థల ట్రేడింగ్ పర్మిట్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







