అజ్మాన్ లో పెట్రోల్ రవాణా వాహనాలపై ఆంక్షలు..!!
- September 08, 2025
యూఏఈ: అజ్మాన్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ రవాణా చేసే వాహనాలను ఇకపై జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తామని అజ్మాన్ సుప్రీం ఎనర్జీ కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మొదటి చేసిన నేరానికి 5,000 దిర్హామ్ల జరిమానా, అది పునరావృతం అయితే 10,000 దిర్హామ్ల జరిమానా, మూడోసారి నేరం పునరావృతమైతే20,000 దిర్హామ్ల జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తారు. అలాగే, ఆయా పెట్రోలియం సంస్థల ట్రేడింగ్ పర్మిట్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









