అజ్మాన్ లో పెట్రోల్ రవాణా వాహనాలపై ఆంక్షలు..!!
- September 08, 2025
యూఏఈ: అజ్మాన్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ రవాణా చేసే వాహనాలను ఇకపై జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తామని అజ్మాన్ సుప్రీం ఎనర్జీ కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మొదటి చేసిన నేరానికి 5,000 దిర్హామ్ల జరిమానా, అది పునరావృతం అయితే 10,000 దిర్హామ్ల జరిమానా, మూడోసారి నేరం పునరావృతమైతే20,000 దిర్హామ్ల జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తారు. అలాగే, ఆయా పెట్రోలియం సంస్థల ట్రేడింగ్ పర్మిట్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









