అజ్మాన్ లో పెట్రోల్ రవాణా వాహనాలపై ఆంక్షలు..!!
- September 08, 2025
యూఏఈ: అజ్మాన్లో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు విధించారు. అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కొత్త నిబంధన ప్రకారం.. పెట్రోల్ రవాణా చేసే వాహనాలను ఇకపై జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. నిబంధనలు పాటించని వాహనాలకు భారీగా జరిమానా విధిస్తామని అజ్మాన్ సుప్రీం ఎనర్జీ కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మొదటి చేసిన నేరానికి 5,000 దిర్హామ్ల జరిమానా, అది పునరావృతం అయితే 10,000 దిర్హామ్ల జరిమానా, మూడోసారి నేరం పునరావృతమైతే20,000 దిర్హామ్ల జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తారు. అలాగే, ఆయా పెట్రోలియం సంస్థల ట్రేడింగ్ పర్మిట్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







