అమెరికా వీసాపై కొత్త నిబంధనతో భారతీయులకు ఇబ్బందే
- September 08, 2025
అమెరికా: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ఒక ముఖ్యమైన సమాచారం. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకోవాలి.ఇతర దేశాలకు వెళ్లి వేగంగా వీసా ఇంటర్వ్యూ పూర్తి చేసుకునే వెసులుబాటును అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది.
రోనా మహమ్మారి సమయంలో, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా దరఖాస్తులు భారీగా పెరిగిపోయాయి. అపాయింట్మెంట్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తడంతో, చాలామంది భారతీయులు దుబాయ్, బ్యాంకాక్ వంటి ఇతర దేశాలకు వెళ్లి వీసా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ మినహాయింపును ప్రభుత్వం తొలగించింది.
ఈ మార్పు వల్ల పర్యాటకం (B2), వ్యాపారం (B1), విద్య (F-1), తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారి పై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు తప్పవు. ఈ కొత్త నిబంధనల కారణంగా, విదేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్మెంట్లు తీసుకున్నవారు ఇప్పుడు తమ స్వదేశంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మార్పుల వల్ల అమెరికా ప్రయాణాలకు చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తప్పనిసరి. అలాగే, వీసా ప్రక్రియకు పట్టే సుదీర్ఘ సమయాన్ని కూడా దరఖాస్తుదారులు పరిగణనలోకి తీసుకోవాలి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ ప్రణాళికలను మార్చుకోవడం లేదా సులభమైన వీసా నిబంధనలు ఉన్న ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!