మస్కట్లో COMEX 2025 ప్రారంభం..!!
- September 08, 2025
మస్కట్: గ్లోబల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ "COMEX 2025" 34వ ఎడిషన్ ప్రారంభమైంది. రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ దీనిని ప్రారంభించారు.
ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఏఐ, సైబర్ భద్రత, అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలతో సహా అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో కొత్త ఉత్పత్తులు అన్నింటిని ఒకే చోట చూసే వీలు కల్పించారు. అలాగే, ఆధునిక టెక్నాలజీలో పరిశోధన, ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







