టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి
- September 09, 2025
న్యూ ఢిల్లీ: టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ యాప్ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని2 ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే యాప్స్ను తిరిగి అనుమతించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టిక్ టాక్ యాప్ మళ్లీ భారతదేశంలోకి వస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన మంత్రి వైష్ణవ్, టిక్ టాక్కు సంబంధించిన నిషేధం పూర్తిగా భద్రతకు సంబంధించినదని, దానిని ఎత్తివేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. ప్రజల డేటా భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.
టిక్ టాక్ వంటి యాప్స్పై నిషేధం విధించడం వెనుక జాతీయ భద్రతే ప్రధాన కారణమని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా భారతీయ పౌరుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందని, దేశ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. తమ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం దేశ భద్రత మాత్రమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







