కువైట్లో జరిగిన GCC సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న ఒమన్
- September 09, 2025
మస్కట్: కువైట్లో "GCC మినిస్టీరియల్ కమిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ అండ్ సెంటర్స్" సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ సుల్తానేట్ రాయబారి డాక్టర్ సలేహ్ అమీర్ అల్ ఖరౌసి ఒమన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో GCC సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కార్యనిర్వాహక ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలు చర్చించారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలు, డిజిటల్ రక్షణను పెంచడంపై చర్చించారు. అలాగే, పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కొవడానికి చేపట్టాల్సి కార్యాచరణను సమీక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం కోసం "సైబర్ థ్రెట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్" ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రణాళికను ఆమోదించారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







