కువైట్‌లో జరిగిన GCC సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న ఒమన్

- September 09, 2025 , by Maagulf
కువైట్‌లో జరిగిన GCC సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న ఒమన్

మస్కట్: కువైట్‌లో  "GCC మినిస్టీరియల్ కమిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ అండ్ సెంటర్స్" సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ సుల్తానేట్ రాయబారి డాక్టర్ సలేహ్ అమీర్ అల్ ఖరౌసి ఒమన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో GCC సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కార్యనిర్వాహక ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలు చర్చించారు.

సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలు, డిజిటల్ రక్షణను పెంచడంపై చర్చించారు. అలాగే, పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కొవడానికి చేపట్టాల్సి కార్యాచరణను సమీక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం కోసం "సైబర్ థ్రెట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్" ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చే ప్రణాళికను ఆమోదించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com