కువైట్లో జరిగిన GCC సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న ఒమన్
- September 09, 2025
మస్కట్: కువైట్లో "GCC మినిస్టీరియల్ కమిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ అండ్ సెంటర్స్" సమావేశం జరిగింది. ఇందులో ఒమన్ సుల్తానేట్ రాయబారి డాక్టర్ సలేహ్ అమీర్ అల్ ఖరౌసి ఒమన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.ఈ సమావేశంలో GCC సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కార్యనిర్వాహక ప్రణాళికలకు సంబంధించిన వివిధ విషయాలు చర్చించారు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలు, డిజిటల్ రక్షణను పెంచడంపై చర్చించారు. అలాగే, పెరుగుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కొవడానికి చేపట్టాల్సి కార్యాచరణను సమీక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో GCC దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం కోసం "సైబర్ థ్రెట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్" ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్రణాళికను ఆమోదించారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







