దోహాలో భారీ పేలుళ్లు–దాడిని ఇజ్రాయెల్ ధృవీకరణ
- September 09, 2025
దోహా: ఇజ్రాయెల్ సైన్యం ఖతార్లో హమాస్ నేతలపై దాడి జరిపినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఈ విషయం పై ఐడీఎఫ్ (Israel Defense Forces) ఎక్స్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఐడీఎఫ్ తెలిపిన ప్రకారం – “హమాస్ తీవ్రవాద సంస్థ సీనియర్ నేతల పై ఐడీఎఫ్ మరియు ఐఎస్ఏ (ISA) సంయుక్తంగా ఖచ్చితమైన దాడి జరిపాయి. ఈ హమాస్ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను నడిపిస్తూ, అక్టోబర్ 7 న జరిగిన క్రూరమైన మారణహోమానికి నేరుగా బాధ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్పై జరుగుతున్న యుద్ధాన్ని కూడా వీరే ప్రణాళికలు రచించి నడిపిస్తున్నారు” అని పేర్కొంది.
పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందులో భాగంగా అత్యంత ఖచ్చితమైన ఆయుధాలు, అదనపు గూఢచారి సమాచారం ఉపయోగించామని ఐడీఎఫ్ వెల్లడించింది.
“అక్టోబర్ 7 మారణహోమానికి బాధ్యులైన హమాస్ తీవ్రవాద సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు మా చర్యలు కఠినంగా కొనసాగుతాయి” అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









