దోహాలో భారీ పేలుళ్లు–దాడిని ఇజ్రాయెల్ ధృవీకరణ
- September 09, 2025
దోహా: ఇజ్రాయెల్ సైన్యం ఖతార్లో హమాస్ నేతలపై దాడి జరిపినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఈ విషయం పై ఐడీఎఫ్ (Israel Defense Forces) ఎక్స్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఐడీఎఫ్ తెలిపిన ప్రకారం – “హమాస్ తీవ్రవాద సంస్థ సీనియర్ నేతల పై ఐడీఎఫ్ మరియు ఐఎస్ఏ (ISA) సంయుక్తంగా ఖచ్చితమైన దాడి జరిపాయి. ఈ హమాస్ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను నడిపిస్తూ, అక్టోబర్ 7 న జరిగిన క్రూరమైన మారణహోమానికి నేరుగా బాధ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్పై జరుగుతున్న యుద్ధాన్ని కూడా వీరే ప్రణాళికలు రచించి నడిపిస్తున్నారు” అని పేర్కొంది.
పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అందులో భాగంగా అత్యంత ఖచ్చితమైన ఆయుధాలు, అదనపు గూఢచారి సమాచారం ఉపయోగించామని ఐడీఎఫ్ వెల్లడించింది.
“అక్టోబర్ 7 మారణహోమానికి బాధ్యులైన హమాస్ తీవ్రవాద సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు మా చర్యలు కఠినంగా కొనసాగుతాయి” అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







