ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- September 09, 2025
అబుధాబి: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ మంగళవారం అబుదాబి వేదికగా ప్రారంభమైంది. ఈ సారి పోటీల్లో ఉత్సాహం, ఉత్కంఠ రెండూ ఎక్కువగా ఉండబోతున్నాయనే అంచనాలు ముందే ఉన్నాయి. గ్రూప్-బి లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు హాంకాంగ్ తో తలపడింది. పేపర్ మీద బలమైన జట్టుగా కనిపించిన ఆఫ్ఘన్లకు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది.
టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. వేగంగా పరుగులు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని వ్యూహం వేసినా, హాంకాంగ్ బౌలర్లు (Hong Kong bowlers) క్రమశిక్షణతో బంతులు వేస్తూ మ్యాచ్ను తమ పట్టు లోకి తెచ్చుకున్నారు. జట్టు స్కోరు 25 పరుగుల వద్దనే స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (8) వికెట్ కోల్పోవడం ఆఫ్ఘన్లకు పెద్ద షాక్గా మారింది. ఆయుష్ శుక్లా వేసిన బంతిని గుర్బాజ్ బౌండరీ ప్రయత్నంలో ఎగరబెట్టగా, ఫీల్డర్ చేతికి అందింది.
ఇదే సమయంలో మరో ప్రధాన బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (1) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.అతీక్ ఇక్బాల్ వేసిన ఓవర్లో జద్రాన్ డిఫెన్సివ్ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు పడిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 26/2 గా కష్టాల్లో పడింది. అతీక్ ఇక్బాల్ వేసిన ఓవర్లో జద్రాన్ ఔటవ్వడంతో, ఆఫ్ఘన్ కేవలం ఒక్క పరుగు తేడాతో రెండు ముఖ్యమైన వికెట్లను నష్టపోయింది.
హాంకాంగ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆఫ్ఘన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. పవర్ప్లే ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. తాజా సమాచారం అందేసరికి, ఆఫ్ఘన్ జట్టు 7 ఓవర్లలో 2 వికెట్లకు 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సెదికుల్లా అటల్ (27), మహమ్మద్ నబీ (18) ఉన్నారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకుని జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!









