మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘SYG’ కీలక షెడ్యూల్ ప్రారంభం
- September 09, 2025
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు (SYG) కీలకమైన షూటింగ్ షెడ్యూల్ లోకి ఎంటరైయింది.
రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ₹125 కోట్ల బడ్జెట్తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా నిలుస్తోంది.
సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే అప్ కమింగ్ షెడ్యూల్లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సూపర్స్టార్తో సాయి దుర్గ తేజ్ తలపడతారు. గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే CGI వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.
సాయి దుర్గ తేజ్ గత రెండు సంవత్సరాలుగా ‘ సంబరాల ఏటి గట్టు’ కోసం అంకితభావంతో పని చేస్తున్నారు. ఈ పాత్రకు అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు .
SYGని మొదట దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నా, ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
‘హనుమాన్’ బ్లాక్బస్టర్ విజయం తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో SYG ఒకటిగా నిలుస్తోంది.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘సంబరాల యేటి గట్టు’ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ KP,
నిర్మాతలు: K నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









